రెండేళ్ళ పసిపాప … అల్లరిముద్దుగా పెంచుకుంటూ ముద్దులు పెడతారు కాని ముక్కు నోరు మూసేసి శ్వాస ఆడకుండా ఎవరైనా చంపేసుకుంటారా ? సొంతమనిషి కాకపోయినా అంత ధైర్యం రావడం కష్టం.అలాంటిది సొంత తల్లే చంపేసింది.
నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసింది.అక్కడితో అయిపోలేదు కథ .తన కూతురు ఎలా చనిపోయిందో తనకి తెలిదు అంటూ మొండికేసింది.కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది.
ఈ విచిత్ర విషాద గాధను పూర్తిగా తెలుసుకోండి.
తల్లి పేరు కోడి అన్నే జాక్సన్.
వయసు 20 ఏళ్ళు.భర్త పేరు పాల్ హుగాన్.
కూతురు పుట్టేవరకు వీరిద్దరి మధ్య బాగున్న సంబంధాలు, ఆ తరువాత దెబ్బతిన్నాయి.దానికి భార్య అన్నే ప్రవర్తనే కారణం అంటున్నారు బంధువులు.
అన్నే మెంటల్ గా మామూలు మనిషి కాదట.చిన్న చిన్న విషయాలకు కూడా కోపగించుకోవడం, తన మీద తనే దాడి చేసుకోవడం లాంటి పనులు చేసేదట.
మొత్తానికి భార్య భర్త వేరు పడ్డారు.కూతుర్ని కొన్ని రోజులు తన దగ్గర ఉంచుకొని, మరికొన్ని రోజులు భర్త దగ్గరికి పంపించేది.
ఒక్కసారిగా ఏమైందో … “నన్ను క్షమించు.తన చివరి జ్ఞాపకం నీ దగ్గర ఉండాలి” అంటూ మెసేజ్ లో పెడుతూ భర్తకి కూతురు ఫోటో పంపించింది.
అసలేం జరుగుతోందో భర్త అర్థం చేసుకోని అన్నే ఉంటున్న ఇంటికి చేరుకునే లోపే అక్కడికి పోలీసులు వచ్చి ఉన్నారు.లోపల చూస్తే తన కూతురు చనిపోయి ఉంది.
భార్యకి కత్తి గాట్లు ఉన్నాయి.పోలీసులు అడిగితే పాప ఎలా చనిపోయిందో అర్థం కావడం లేదు అంటోంది భార్య.
కోర్టులో ప్రవేశపెట్టారు.ముందు తాను చంపలేదని, పాప ఎలా చనిపోయిందో తనకి తెలియదని మొండివాదన వినిపించింది.
భర్తకి తన చివరి జ్ఞాపకం అంటూ మెసేజ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటూ పదే పదే అడిగేసరికి తన నేరం ఒప్పుకుంది.మతి స్థిమితం లేని తన భార్యను చూస్తూ, తానూ కోల్పోయిన రెండేళ్ళ చిన్నారి ఫోటో చూస్తూ ఆ భర్త ఏడ్చిన తీరు అక్కడున్నవారందరిని కలచివేసింది.
ఇప్పుడు కత్తి గాట్లు ఎలా వచ్చాయో అనే కదా మీ అనుమానం.కూతురి ఊపిరి ఆపి చంపిన తరువాత తనని తాను కత్తిపోటుతో చంపుకునే ప్రయత్నం చేసిందట.
కాని అందులో సఫలం కాలేదు.ఆ తరువాత ఏం చేయాలో తెలియక తానే అంబులెన్స్ కి, పోలీసులకి ఫోన్ చేసిందట.
అన్నేకి జీవిత ఖైదు శిక్ష విధించింది కోర్టు.