తమిళంలో ‘మగధీర’ అది మెగా మల్టీస్టారర్ ఏంటా అని ఆలోచిస్తున్నారా.అసలు విషయం ఏంటంటే మెగా హీరోలు రామ్చరణ్, అల్లు అర్జున్ కలిసి నటించిన చిత్రం ‘ఎవడు’.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్రాజు నిర్మించిన ‘ఎవడు’ సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఆ సినిమా ఇప్పుడు తమిళంలో డబ్ కాబోతుంది.
ఎప్పుడో తమిళ నిర్మాత ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ తీసుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల డబ్బింగ్ వాయిదా వేస్తూ వచ్చాడు.ఇన్నాళ్లకు ఈయన తమిళ ప్రేక్షకుల ముందుకు ‘ఎవడు’ సినిమాను తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.
ప్రస్తుతం చివరి దశ డబ్బింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను తమిళ ప్రేక్షకుల ముందుకు ‘మగధీర’ టైటిల్తో తీసుకు వెళ్లాలనే నిర్ణయంకు తమిళ నిర్మాత వచ్చినట్లుగా తెలుస్తోంది.కథానుసారం తమిళంలో ‘మగధీర’ టైటిల్ ఈ సినిమాకు బాగా సూట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
ఇక రామ్ చరణ్ కెరీర్లో ‘మగధీర’ ఎంతటి రికార్డును బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ సెంటిమెంట్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుందేమో అనే ఉద్దేశ్యంతో తమిళ నిర్మాత ఈ టైటిల్ను ఫిక్స్ చేసి ఉంటాడు.
మరి ‘ఎవడు’ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా చూడాలి.