మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ త్వరలో తిక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఓం త్రిడి సినిమాను డైరెక్ట్ చేసిన సునీల్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
రీసెంట్ గా క్లైమాక్స్ కు సంబందించిన షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.సుప్రీం సినిమాతో స్టార్ రేంజ్ కు ఐదిగిన సుప్రీం హీరో సాయి ధరం తేజ్ తన తిక్క చూపించేందుకు సిద్ధమయ్యాడు.
సినిమా దాదాపు పూర్తయినట్టే అట.
ఇక జూలై రెండు మూడు వారాల్లో సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.మెగా అభిమానులను ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ ను అతి తక్కువ టైంలో తన బుట్టలో వేసుకున్న సాయి ధరం తేజ్ ఈ మోషన్ పోస్టర్ లో కూడా గుర్రం మీద ఓ చేత్తో బీరు బాటిల్, మరో చేత్తో పీకను ఊదుతూ సరదాగా కనిపిస్తున్నాడు.ఓం త్రిడి సినిమా పోయినా సరే దర్శకుడు ప్రతిభ అందరు మెచ్చుకున్నారు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్ని హిట్స్ కొడుతూ రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు.తిక్క సినిమాతో ఎలాంటి రిజల్ట్ పొందుతాడో చూడాలి.