మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఈయన ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ మూవీలో నటిస్తున్నాడు.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతుంది.ఆ సినిమా తర్వాత మలయాళ మూవీ ‘బెంగళూరు డేస్’ రీమేక్లో నటించే అవకాశాలున్నాయని అన్నారు.
ఇప్పటికే నిర్మాత దిల్రాజు ఈ మెగా హీరోతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది.ఆ రీమేక్కు సాయి దాదాపుగా ఓకే చెప్పాడు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మెగా హీరోకు మరో రీమేక్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
కన్నడంలో సక్సెస్ అయిన ‘మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి’ రీమేక్ ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్కడ భారీ విజయం సాధించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక ఈ సినిమాను మెగా హీరో సాయి ధరమ్ తేజ్తో రీమేక్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ఎక్కువ శాతం మందిలో వ్యక్తం అవుతోంది.
దాంతో త్వరలో సాయి ధరమ్ తేజ్ ఆ సినిమాను చూసే అవకాశాలున్నాయి.ఆ సినిమా రీమేక్ విషయంపై త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.