ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రస్తుతం ‘రుద్రమదేవి’ చిత్రం విడుదల పనుతో బిజీగా ఉన్నాడు.దాదాపు మూడు సంవత్సరాల క్రితం ‘రుద్రమదేవి’ని ప్రారంభించిన గుణశేఖర్ ఎట్టకేలకు సెప్టెంబర్ 4న ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, రానాలు ముఖ్య పాత్రల్లో నటించారు.ఇక ఈ సినిమా విడుదల కాగానే మరో భారీ చారిత్రాత్మక నేపథ్యంలో ఒక సినిమాను తెరకెక్కించేందుకు గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నాడట.
అందుకోసం ‘ప్రతాపరుద్రుడు’ అనే టైటిల్ను రిజిస్ట్రర్ చేయించాడు‘రుద్రమదేవి’ చిత్రం షూటింగ్లో అల్లు అర్జున్ పాల్గొంటున్న సమయంలో ఆయనకు ‘ప్రతాపరుద్రుడు’ కథాంశంను దర్శకుడు గుణశేఖర్ చెప్పాడని, కథ బాగా నచ్చడంతో అల్లు అర్జున్ నటించేందుకు ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు.వచ్చే సంవత్సరం చివర్లో ‘ప్రతాపరుద్రుడు’ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.2018లో విడుదలకు ఛాన్స్ ఉందని అంటున్నారు.ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ ఒక సినిమాలో నటిస్తున్నాడు.
వచ్చే సంవత్సరంలో ఆ సినిమా రాబోతుంది.