డీజే కలెక్షన్ల వివాదం .. దిల్ రాజు ని ముట్టడించిన మెగాస్టార్ ఫ్యాన్స్

అపుడెప్పుడో పోకిరి- స్టాలిన్, మగధీర – దూకుడు సమయంలో జరిగిన కలెక్షన్ల గొడవలు గుర్తున్నాయా ? సోషల్ మీడియా హల్చల్ పెద్దగా లేని ఆరోజుల్లో చిరంజీవి అభిమానులు – మహేష్ బాబు అభిమానులు తెగ కొట్టేసుకున్నారు.బయట కూడా దేబ్బలాటకి దిగారు.

 Mega Fans Attacked Dil Raju Office On Dj Collections-TeluguStop.com

టీవి షోల్లో కూడా వాదనలు జరిగాయి.ఇప్పుడు మళ్ళీ ఇవన్ని జరుగుతున్నాయి.

కాని కేవలం సోషల్ మీడియాకే పరిమితమయిపోయాయి గొడవలు.అల్లు క్యాంప్ వారిమీద విరుచుకుపడుతున్నారు మెగా అభిమానులు.

సోషల్ మీడియాను దాటిన గొడవలు, దిల్ రాజు ఆఫీసుని ముట్టడించేదాకా వెళ్ళాయి.

నిన్న రాష్ట్ర చిరంజీవి యువతకి చెందిన కొందరు చిరంజీవి అభిమానులు దిల్ రాజు ఆఫీసుని ముట్టడించారు.

హరీష్ శంకర్, అల్లు అర్జున్, దిల్ రాజుకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.దాంతో వారిని లోపలికి పిలిచి శాంతింపజేసే ప్రయత్నం చేసారు దిల్ రాజు.

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్లుగా డీజే ఖైది నం 150 ని దాటలేదని, అలాంటి రిపోర్ట్ ఏవైనా ప్రచారం అయితే అవి ఫేక్ అని దిల్ రాజు వారికి చెప్పారట.పబ్లిసిటి కోసం కొన్ని ఫేక్ అన్నౌన్మెంట్స్ వస్తే వాటిని పట్టించుకోవద్దని చెప్పి వారిని పంపించేసారు.

ఇదంతా డీజే నైజాం కలెక్షన్ల వివాదం మూలానే జరిగింది.డీజే నైజాంలో 20 కోట్ల షేర్ దాటినట్లు ప్రకటించారు హరీష్ శంకర్.

పైగా ఆ కలెక్షన్లు నిజం కాదని నిరూపిస్తే సినిమాలు తీయడం మానేస్తానని ఛాలెంజ్ చేసారు.మరి ఈ లెక్క నిజమే అయితే డీజే నైజాం ఏరియా వరకు ఖైది నం 150 ని దాటినట్లే.

కాని అక్కడ దిల్ రాజు ఎక్కడ దాటలేదని మెగాఅభిమానులని శాంతింపజేశారు.ఇంత కిరికిరి జరుగుతున్నా, అల్లు అర్జున్ మాత్రం బయటకి తన వెర్షన్ వినిపించకుండా కామ్ గా ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube