మెగా కుటుంబంలో కలహాలు గత కొంత కాలగా మెగా ఫ్యాన్స్ను కలువర పెడుతున్నాయి.మెగా కుటుంబ హీరోలు ఎవరికి వారే అన్నట్లుగా విడి పోవడంతో అభిమానులు ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు.
అంతా కలిసి ఉంటేనే తమకు కూడా గౌరవం ఉంటుందని ఫ్యాన్స్ తాజాగా జరిగిన మీటింగ్లో ఏకంగా నాగబాబుతోనే చెప్పుకొచ్చారు.దాంతో మెగా ఫ్యామిలీ హీరోలను దగ్గరకు తీసుకు వచ్చే బాధ్యతను తాను తీసుకుంటాను అంటూ నాగబాబు అభిమానులకు హామీ ఇచ్చాడు.
త్వరలోనే మెగా హీరోలు అంతా కూడా ఒక కార్యక్రమంలో పాల్గొనేలా చేస్తాను అంటూ వారికి చెప్పుకొచ్చాడు.
నాగబాబు హామీ ఇచ్చి చాలా రోజులు అయ్యింది.
అయినా ఇప్పటి వరకు వారి కలయికు సంబంధించిన ఏ ఒక్క అధికారిక వార్త కూడా రాలేదు.అయితే తాజాగా మెగా ఫ్యామిలీకి సన్నిహితులయిన వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం నాగబాబు ఒక మల్టీస్టారర్ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు.
ఆ మల్టీస్టారర్ సినిమాలో చిరంజీవి, పవన్, నాగబాబుతో పాటు బన్నీ, చరణ్లు కూడా నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం అందుకు సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నాయని, పలువురు రచయితలతో నాగబాబు సంప్రదింపులు జరుపుతున్నాడు.
అన్నలతో కలిసి నటించేందుకు ఇప్పటికే పవన్ ఓకే చెప్పాడట.ఈ సినిమా వస్తే తెలుగు సినిమా రికార్డులు బద్దలు కావడంతో పాటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారు.