శ్రీలంక బ్యాక్ డ్రాప్ తో మనోజ్ 'ఒక్కడు మిగిలాడు'..!

మంచు ఫ్యామిలీ నుండి డ్యాషింగ్ హీరోగా మొదట మంచి మంచి సినిమాలు చేస్తూ మెస్మరైజ్ చేసిన మనోజ్ ఈ మధ్య రేసులో వెనుకపడ్డాడని ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు.రీసెంట్ గా వచ్చిన శౌర్య సినిమా ఫ్లాప్ అవడం అటుంచితే మనోజ్ లుక్ మీద కూడా చాలా విమర్శలు వచ్చేలా చేశాయి.

 Manoj Title As Okkadu Migiladu-TeluguStop.com

ఇక ప్రస్తుతం సత్య డైరక్షన్లో సినిమా చేస్తున్న మనోజ్ ఆ సినిమా టైటిల్ గా ‘ఒక్కడు మిగిలాడు’ అంటూ పెట్టబోతున్నారట.ఈ సినిమాలో హీరోయిన్ గా మరోసారి రెజినానే సెలెక్ట్ చేశారు దర్శక నిర్మాతలు.

ఇప్పటికే శౌర్య సినిమాలో జతకట్టిన ఈ జంట మరోసారి ఈ సినిమా కోసం కలిసి చేస్తున్నారు.

శ్రీలంక బ్యాక్ డ్రాప్ తో జరిగే కథగా సినిమా ఉండబోతుందట.

ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు మంచు మనోజ్.సాధారణంగా కొందరు హీరోలకు పెళ్లి తర్వాత లక్ కలిసివస్తే మంచు మనోజ్, అల్లరి నరేష్ లకు పెళ్లి తర్వాత ఫ్లాప్స్ కొనసాగుతూనే ఉన్నాయి.

మరి మంచు మనోజ్ ఆశిస్తున్న సరైన హిట్ ఈ ఒక్కడు మిగిలాడు సినిమా ఇస్తుందో లేదో చూద్దాం.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube