మళ్ళి మణిశర్మతో మహేష్

సూపర్ స్టార్ మహేష్ – మణిశర్మల కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.మహేష్ సగం సినిమాలకి మణిశర్మే మ్యూజిక్ డైరెక్టర్.

 Manisharma Will Compose Background Score In Brahmotsavam-TeluguStop.com

అప్పట్లో మణిశర్మని మహేష్ బాబు ఆస్థాన సంగీత దర్శకుడు అనేవారు.సినిమాలు ఫ్లాప్ అయినా, వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడు సూపర్ హిట్టే.

మురారి పాటలు ఇప్పటికి పెళ్లిల్లో వినబడుతుంటాయి.టక్కరి దొంగ, అతడు, పోకిరి సినిమాల్లోని మహేష్ పరిచయ గీతాలంటే యువత ఇప్పటికి చెవులు కోసుకుంటారు.

అయితే ఖలేజా తరువాత మళ్ళి మహేష్ సినిమాకు మణిశర్మ పాటలు అందించలేదు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి మాత్రం ఆయనే నేపథ్య సంగీతం అందించారు.

ఆ సినిమాకి జనాలు అంతలా కనెక్ట్ అయ్యారంటే దానికి మణిశర్మ సంగీతమే కారణం.ఇప్పుడు మళ్ళి మహేష్ సినిమాకి మణిశర్మ పని చేయబోతున్నారు.

అయితే పాటలు కాదు, మళ్ళి నేపథ్య సంగీతమే అందిస్తారు.అవును, బ్రహ్మోత్సవం సంగీత దర్శకుడు మిక్కి జే మేయర్, కాని మణిశర్మ అయితేనే కథకు న్యాయం చేయగలరని యునిట్ నేపథ్య సంగీతానికి మణిశర్మని ఎంచుకున్నారు.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీవిపి నిర్మిస్తోంది.మహేష్ సరసన కాజల్,సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube