వైకాపా అధినేత, గౌరవ ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డితో, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్.
ఆర్.పీ.యస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు.అయితే వీరిద్దరి భేటీ వెనుక అసలు కారణం ఏంటో అంటూ మీడియా వర్గాలు చెవులు కొరుక్కుంటున్న సంధర్భంలో భేటీ అనంతరం మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం “తాను జగన్ తో భేటీ అయ్యింది రాజకీయం చర్చించడం కోసం కాదు అని, ఎస్.సీ సమస్యలపై జగన్ తో చర్చించాను అని అంతేకాకుండా ఎస్.సీ వర్గీకరణకు సహకరించాలంటూ ఆయనను కోరినట్లు మంద కృష్ణ మీడియాకు తెలిపారు.మరో పక్క జగన్ సైతం దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది.
మరి ఇప్పుడు జరుగుతున్న అస్సెంబ్లీ సమావేశాల్లోఈ వర్గీకరణపై ఏమైనా చర్చకు జగన్ అండ్ పార్టీ తెరలేపుతారేమో చూడాలి.