టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు మరో మల్టీస్టారర్ మూవీని తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.త్వరలోనే వెంకటేష్, పవన్ కళ్యాణ్ల మల్టీస్టారర్ మూవీ ‘గోపాల గోపాల’ విడుదల కాబోతుంది.
ఆ తర్వాత నాగార్జున, కార్తిల మల్టీస్టారర్ మూవీ కూడా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.ఈ క్రమంలోనే మరో మల్టీస్టారర్ సినిమాకు రంగం సిద్దం అవుతున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి.
మంచు విష్ణు, అల్లరి నరేష్ల కాంబినేషన్లో ఒక భారీ కామెడీ సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే సిద్దం అయ్యిందని సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
ఈ మల్టీస్టారర్ సినిమాకు ‘ఢమరుకం’ ఫేం శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు.ఈయన నాగచైతన్యతో ఒక సినిమా చేయాల్సి ఉంది.
ఆ సినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చింది.అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.
దాంతో ఇప్పుడు ఈ మల్టీస్టారర్ పనిలో పడ్డాడు ఈ దర్శకుడు.ప్రస్తుతం విష్ణు మరియు అల్లరి నరేష్లు చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే ఈ మల్టీస్టారర్ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
వచ్చే సంవత్సరంలోనే ఈ మల్టీస్టారర్ మూవీ ప్రేక్షకులకు కను విందు చేసే అవకాశాలున్నాయి.