మంచు లక్ష్మి ఆవేదన

తాజాగా జరిగిన మా అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్‌ గెలుపొందిన విషయం తెల్సిందే.ఈ ఎన్నికల్లో జయసుధ ఓడి పోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని మంచ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.

 Manchu Lakshmi Concerns On Jayasudha-TeluguStop.com

తాను జయసుధ గారిపై చాలా ఆశలు పెట్టుకున్నాను అని, ఒక మహిళ కారణంగానే ఆమెకు తన మద్దతు ఇచ్చినట్లుగా మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.మొదటిసారి మా అధ్యక్షురాలిగా మహిళను చూడాలని ఆశపడ్డాను, కాని అలా జరుగలేదు అని విచారం వ్యక్తం చేసింది.

తొలిసారిగా అధ్యక్ష ఎన్నికల్లో మహిళ పోటీ చేసినందుకు మొదట సంతోషించాను అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.ఇదే ఎన్నికల్లో మంచు లక్ష్మి మా ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక అయిన విషయం తెల్సిందే.

జయసుధ ప్యానెల్‌ నుండి ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన మంచు లక్ష్మికి రాజేంద్ర ప్రసాద్‌ ప్యానల్‌ కూడా మద్దతు ఇవ్వడంతో ఈమె ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యింది.తాను ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్పాడు.

పేద కళాకారుల కోసం అంతా కలిసి మెలిసి పని చేస్తామని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube