‘ప్రేమమ్’ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది అనుపమ పరమేశ్వరన్.18 సంవత్సరాల ఈ అమ్మడు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ను దక్కించుకుంది.‘ప్రేమమ్’ సినిమా అద్బుత విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈమెకు మలయాళంతో పాటు టాలీవుడ్, కోలీవుడ్ల నుండి కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.తెలుగులో ఇప్పటికే ఈమె రెండు సినిమాల్లో ఎంపిక కాగా, తాజాగా మూడవ సినిమాకు కూడా సైన్ చేసింది.
త్రివిక్రమ్, నితిన్ల ‘అఆ’ సినిమాలో రెండవ హీరోయిన్గా ఎంపిక అయ్యింది.‘ప్రేమమ్’ తెలుగు రీమేక్లో నాగచైతన్యకు జోడీగా ఈమె నటించబోతుంది.తాజాగా రవితేజకు జోడీగా హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.దిల్రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘ఎవడో ఒక్కడు’ చిత్రంలో అనుపమను హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగింది.
త్వరలో చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది.ఒకే సారి మూడు పెద్ద చిత్రాల్లో ఆఫర్లు రావడంతో అనుపమ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలగడం ఖాయం అంటున్నారు.
త్వరలో ఈమె మెగా హీరో సినిమాలో కూడా బుక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.