మహేష్ బాబు కి అస్సలు ఇగో ఉండదు అంటారు.అందుకే ఏదైనా సినిమా నచ్చినా, ఎవరైనా బాగా నటించారు అనిపించినా, చిన్నా పెద్దా అని చూడకుండా మెచ్చుకుంటూ ఉంటారు.
ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తూ ఒక యువ హీరోకి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు మన సూపర్ స్టార్.
రాజ్ తరుణ్, ఆవిక గొర్ జంటగా వచ్చిన రెండో సినిమా “సినిమా చూపిస్తా మావ”.
ఆగస్టులో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని మహేష్ బాబు కుడా చూసారట.
ఆయనకీ బాగా నచ్చటంతో యువ హీరో రాజ్ తరుణ్ కి కబురు పెట్టారట వచ్చి కలవమని.వెంటనే రాజ్ తరుణ్ బ్రహ్మోత్సవం సెట్స్ కి వెళ్లి కలిసాడట.
చాలా సేపు మాట్లాడిన మహేష్, సినిమాతో పాటు రాజ్ తరుణ్ నటనని మెచ్చుకున్నారట.దీన్ని రాజ్ తరుణ్ స్వయంగా మీడియాతో పంచుకున్నాడు.
” మహేష్ సార్ సినిమా చూపిస్తా మావ చూసి నన్ను బ్రహ్మోత్సవం సెట్స్ కి రమ్మన్నారు.సినిమా చాలా బాగుందని, బాగా చేసావని మెచ్చుకున్నారు.
నా జీవితంలో అత్యంత సంతోషకరమైన ఘడియలు అవి.నేను ఆయనకీ చాలా పెద్ద అభిమానిని.మహేష్ సార్ చిత్రాలన్నీ మొదటి రోజు వరుసగా నాలుగు షోలు చూడటం నాకు అలవాటు” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు రాజ్ తరుణ్.
రాజ్ తరుణ్ కొత్త చిత్రం “కుమారి 21 ఎఫ్” ఈ నెల 20వ తేదిన విడుదల అవుతున్న విషయం తెలిసిందే.