సూపర్ స్టార్ మహేష్ – ఏ ఆర్ మురుగదాస్ సినిమాకి ముహూర్తం దగ్గరపడింది.బాహుబలి తరువాత అతిపెద్ద తెలుగు ప్రాజెక్ట్ త్వరలోనే మొదలుకాబోతోంది.
మురుగదాస్ ప్రస్తుతం అకిరా అనే హిందీ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.సోనాక్షి సిన్హా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది.
ఇక మహేష్ సినిమా స్క్రిప్ట్ కుడా రెడీగా ఉంది.మరింకెందుకు ఆలస్యం.
అందుకే ఏప్రిల్ లో మొదలుపెట్టాలనుకున్న షూటింగ్ ఫిబ్రవరిలోనే మొదలు పెట్టాలనుకుంటూన్నారట.అయితే ఇది చర్చల దశలోనే ఉంది.ఇంకా ఈ విషయంపై నిర్ణయం తీసుకోలేదు.ఒకవేళ ఫిబ్రవరిలోనే షూటింగ్ మొదలుపెట్టినా, మహేష్ అప్పుడే షూట్ కి వెళ్ళడు.
ఆ సమయంలో బ్రహ్మోత్సవం షూటింగ్ లో బిజీగా ఉంటాడు సూపర్ స్టార్.ఇతర నటుల మీద సన్నివేశాలు తీయాల్సిందే.
మహేష్ వచ్చాకే చేద్దాం అనుకుంటే ముందు చెప్పినట్టుగా , ఏప్రిల్ లోనే షూట్ మొదలుపెడతారు.
బాలివుడ్ భామ శ్రద్ధకపూర్ ఈ చిత్రంలో మహేష్ తో రోమాన్స్ చేయనుంది.
ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయిక్తంగా ఈ సినిమాను నిర్మిస్తారు.హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తారు.