టాలీవుడ్ సూపర్ స్టార్ మహెష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా “శ్రీమంతుడు”.ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు.
భారి బడ్జెట్తో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాపై సినీ జనాల్లో సైతం అంచనాలు తారా స్థాయిలో వున్నాయి.ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ఇప్పటి నుండే డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాను అన్ని ఏరియాల్లో కూడా రికార్డ్ స్థాయి ధర్కు అమ్మేందుకు మైత్రి మూవీస్ బ్యానర్ నిర్మాతలు సిద్దంగా వున్నారు.
ఇక ఓవర్సీస్లో కింగ్ అయిన మహేష్ బాబు తాజాగా ఈ సినిమాతో కూడా అక్కడ మాయ చేసే అవకాశాలు వున్నాయని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు.
అందుకే ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు.ఈ సినిమాను ఏకంగా 8.5 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.మహేష్ బాబు గత చిత్రాలు ఓవర్సీస్లో 10 కోట్ల మార్క్ను దాటాయి.
దాంతో ఈ సినిమాను కూడా భారీ మొత్తనికి కొనుగోలు చేయడం జరిగింది.ఈ సినిమాలో మహేష్కు జతగా శృతిహాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.