బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి అందరికి తెలిసిందే.తల్లి పేరుతో బాలకృష్ణ నడుపుతున్న ఈ హాస్పిటల్ ఎన్నో వేల ఆపరేషన్లు చేసింది.
పేదవారికి ఉచిత వైద్యసేవలు కూడా అందించింది.మంచి మనసున్న మన బాలయ్య బాబు చాలా మంది పేదపిల్లలను ఆదుకున్నారు.
బాలకృష్ణకు ఇప్పుడు తమవంతు సాయం అందిస్తోంది శ్రీమంతుడు టీమ్.
విషయంలోకి వెళ్తే, మహేష్ బాబు శ్రీమంతుడు లో ఉపయోగించిన సైకిల్ సొంతం చేసుకోవడానికి 999 రూపాయలు చెల్లించి 2200 మంది సూపర్ స్టార్ అభిమానులు తమ పేరుని నమోదు చేసుకున్నారు.
వచ్చిన డబ్బులతో ప్రతి అభిమానికి శ్రీమంతుడు టీషర్ట్ తో పాటు కొన్ని బహుమతులు పంపించారు.మిగిలిన ఇరవై లక్షలలో 15 లక్షలు “హీల్ ఏ చైల్డ్” ఫౌండేషన్ కు పంపించారు.
ఈ చారిటి సంస్థ కు మహేష్ ప్రచారకర్త.ఇక్కడ పేద పిల్లలకు ఉచిత వైద్య సేవలు అందిస్తారు.
మరో ఐదు లక్షలు బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు అందించారు.ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ, శ్రీమంతుడు నిర్మాతలు, మహేష్ శ్రీమతి నమ్రతతో పాటు, హీల్ ఏ చైల్డ్, బసవతారకం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇక శ్రీమంతుడు సైకిల్ ను కరీంనగర్ కు చెందిన ఓ అభిమాని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.