యువనటుడు, మహేష్ బాబు బావ, సుధీర్ బాబు జీతెలుగులో వచ్చే “కొంచెం టచ్ లో ఉంటే చెప్తా” ప్రోగ్రామ్ కి వెళ్ళాడు.ఆ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రొమోలో పవన్ కళ్యాణ్ ని సుధీర్ నెం.1 అన్నట్టుగా చూపించడంతో మహేష్ – పవన్ అభిమానుల మధ్య పెద్ద దూమారమే రేగింది.కాని సుధీర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా, ప్రోమో అలా ఎడిట్ చేయడం వల్ల మనస్పర్థలు వచ్చాయని, మహేష్ ఎప్పటికి నెం.1 అని, విషయంపై క్లారిటి ఇవ్వడంతో వివాదం చల్లబడింది.
కాని ఇప్పుడు ఆ వేడి ఆ ప్రోగ్రాం యాంకర్ ప్రదీప్ కు తగిలింది.
టీఆర్పీల కోసం ఏదైనా చేస్తారా అంటూ మహేష్ అభిమానులు చాలామంది ప్రదీప్ కి వార్నింగ్ ఇస్తూ సందేశాలు పంపిస్తున్నారట.ప్రోగ్రాం ఆపేస్తామని, నీ పని పడతామని కాస్త బయటకి చెప్పుకోలేని పదప్రయోగాలు చేస్తున్నారట.
ఆ ఆణిముత్యాల్లోంచి ఇక్కడ ఒకటి మీకోసం.
పాపం ప్రదీప్ .అందరికి ఓపిగ్గా జరిగిన విషయం చెబుతూ, నేను కూడా మహేష్ కి పెద్ద అభిమానినే, అనుకోకుండా తప్పు జరిగిపోయింది అని అభిమానుల వేడిని చల్లార్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాడు.
.