తెలుగు సినిమా మార్కేట్ గత ఏడెనిమిది నెలల కాలంలో చాలా మారిపోయింది.టికేట్ రేట్లు విపరీతంగా పెంచేశారు.
హైర్స్ రూపంలో కూడా కోట్లు రాబడుతున్నారు మొదటిరోజు.ఇక బెనిఫిట్ షోల సంఖ్య కుడా బాగా పెరిగిపోయింది.
బాహుబలి ఈ ఫార్ములాని మొదలుపెడితే, శ్రీమంతుడు కొంతవరకు, సర్దార్ గబ్బర్ సింగ్ పూర్తిస్థాయిలో ఇదే ఫార్ములాని వాడుకోని భారి ఓపెనింగ్స్ రాబట్టుకున్నాయి.టాక్ బాగుంటే 80 కోట్ల షేర్ కొట్టడం సామామ్యమైన విషయమే ఇప్పుడు అగ్రహీరోలకి.
ఈ ఏడాది వచ్చిన పెద్ద సినిమాల్లో నాన్నకు ప్రేమతో, సర్దార్ గబ్బర్ సింగ్, రెండూ కూడా 50 కోట్ల కలెక్షన్లతో సరిపెట్టుకున్నాయి.అల్లు అర్జున్ సరైనోడు 60 కోట్ల మార్క్ ఈజీగా దాటేస్తుంది.
ఇంకా మూడు పెద్ద సినిమాలు మిగిలి ఉన్నాయి.అవే బ్రహ్మోత్సవం, జనతా గ్యారేజ్, రామ్ చరణ్ తని ఒరువన్ రీమేక్.
మహేష్ ఇప్పటికే 85-90 కోట్ల షేర్ రాబట్టేశాడు.శ్రీమంతుడు సెలవుల్లో వచ్చుంటే అప్పుడే వంద కోట్ల షేర్ కొట్టేసేదేమో.
అయితే ఆ అవకాశం బ్రహ్మోత్సవం ముందర ఉంది.చిత్రానికి మంచి టాక్ వస్తే చాలు, వెసవి సెలవుల్లో కలెక్షన్ల వరద పారించి వంద కోట్ల షేర్ రాబట్టగల సమర్థుడు సూపర్ స్టార్.
బాక్సఫీస్ లెక్కల ప్రకారం ఆశించినంత స్థాయిలో రాణించట్లేదు ఎన్టీఆర్.మొన్నటికి మొన్న 50 కోట్ల సినిమా చేజిక్కించుకున్న ఎన్టీఆర్ నెక్స్ట్ టార్గేట్ 80 కోట్ల షేర్ సంపాదించడం.
వెనకాల కొరటాల శివ లాంటి బ్రాండ్ డైరెక్టరు , భారి అభిమాన గణం ఉండటంతో, ఎన్టీఆర్ మినిమమ్ టార్గేట్ 80 కోట్లు.
ఇక రామ్ చరణ్ చేస్తున్నది పూర్తి క్లాస్ సినిమా.
చరణ్ ఫామ్ ఈ మధ్య బాగాలేదు.కాబట్టి అప్పుడే తని ఒరువన్ రీమేక్ కలెక్షన్లపై ఒక అవగాహనకు రావడం తొందరపాటే.