సూపర్ స్టార్ మహేష్బాబు ‘శ్రీమంతుడు’ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది.వచ్చే నెల 7న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది.
మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి కానున్నాయి.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది.
ఇక ఈ సినిమాను మైత్రి మూవీస్ బ్యానర్తో కలిసి మహేష్బాబు స్వయంగా నిర్మించిన విషయం తెల్సిందే.
‘శ్రీమంతుడు’ నిర్మాణ విషయాల్లో మహేష్ బాబు భార్య నమ్రత శ్రద్ద తీసుకున్నట్లుగా తొస్తోంది.
లైన్ ప్రొడ్యూసర్గా నమ్రత వ్యవహరించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఈమె సినిమా నిర్మాణంకు చెందిన ప్రతి విషయంలో కూడా పాలు పంచుకుని, నిర్మాణ వ్యయంను అదుపులో ఉంచే ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు.
మహేష్బాబు కెరీర్ ఈ స్థాయిలో దూసుకు పోతుంది అనడానికి కారణం ఖచ్చితంగా నమ్రత అనే విషయం అందరికి తెలిసిందే.ఈమె వెనుక ఉండి మహేష్బాబును నడిపిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
నమ్రత తన జీవితంలోకి వచ్చిన తర్వాత మహేష్బాబులో చాలా మార్పులు వచ్చాయి.ముందు ముందు నమ్రత మరే విభాగాల్లో వేలు పెడుతుందో చూడాలి.