సూపర్ స్టార్ మహేష్బాబు పూర్తి స్థాయి నిర్మాతగా త్వరలో మారబోతున్నాడు.ఇప్పటికే ఈయన ‘శ్రీమంతుడు’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించాడు.
మొదటి సినిమాతో మంచి లాభాలను దక్కించుకున్న మహేష్ ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని ప్రసాద్ వి పొట్లూరితో కలిసి నిర్మిస్తున్నాడు.ఆ తర్వాత నాని హీరోగా మహేష్బాబు నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది.
మహేష్బాబు టీం ప్రస్తుతం చిన్న సినిమాల కోసం కథలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.ఇప్పటికే వరుసగా చిన్న చిత్రాలను నిర్మించాలని నిర్ణయించుకున్న మహేష్బాబు తన మొదటి చిన్న చిత్రంను నాని హీరోగా నిర్మించబోతున్నాడు.
సదరు చిత్రాల నిర్మాణ వ్యవహారాలను మహేష్బాబు భార్య నమ్రత చూసుకోనున్నారు.వచ్చే సంవత్సరం ఆరంభంలో నాని హీరోగా నూతన దర్శకుడి దర్శకత్వంలో మహేష్బాబు నిర్మాణ సంస్థలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
ఈ కాంబినేషన్కు భారీ క్రేజ్ ఉంటుంది.నాని ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.