టాలీవుడ్లో ఇటీవల మల్టీస్టారర్ ట్రెండ్ కాస్త జోరందుకుంది.ఈ ట్రెండ్కు ఆకర్షణ తెచ్చింది సీనియర్ హీరో విక్టరీ వెంకటేషే.
వెంకీ ఇప్పటికే స్టార్ హీరోలు పవన్కళ్యాణ్, మహేష్బాబుతో పాటు యంగ్ హీరో రామ్తో కూడా మల్టీస్టారర్ సినిమాలు చేశాడు.ఈ క్రమంలోనే వెంకీతో సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు చేసిన ప్రిన్స్ మహేష్బాబు ఇప్పుడు మరో మల్టీస్టారర్ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం
అయితే ఈ సినిమాలో మహేష్తో పాటు మరో స్టార్ హీరో స్క్రిన్ షేర్ చేసుకోకపోయినా టాలీవుడ్లో టాప్ కమెడియన్ హీరోగా గుర్తింపు పొందిన హీరో మహేష్తో కలిసి నటిస్తున్నాడు.
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ అనే పొలిటికల్ థ్రిల్లర్లో నటిస్తున్నాడు
ఈ సినిమా తర్వాత చలసాని అశ్వనీదత్ – దిల్ రాజు సంయుక్తంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే సినిమాకు మహేష్ ఓకే చెప్పాడు.ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో మహేష్తో పాటు కామెడీ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.మరి మహేష్ పక్కన నరేష్కు ఎలాంటి రోల్ ఉంటుందో ? దర్శకుడు వంశీ వీరిద్దరి కాంబోలో సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో ? అన్న ఆసక్తి అందరిలోను నెలకొంది.