మణిరత్నం మహేష్ సినిమా కలిసి అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుడు అడిగితే మహేష్ కూడా డేట్స్ అడ్జెస్ట్ చేయక తప్పదు ఆ సినిమాలో మహేష్ తో పాటుగా తమిళ స్టార్ హీరో విజయ్ ను కూడా అనుకున్నారు.
అయితే రెండు సంవత్సరాలుగా నడిచిన ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఆగిపోయింది.ఇక సినిమా ఆగిపోడానికి కారణం హీరోల డేట్స్ అని కొందరంటే కాదు ఒక హీరో ఒప్పుకుని మరో హీరో ఒప్పుకోలేదని ఏదేదో అన్నారు.
అయితే ఆ సినిమా ఆగిపోడానికి అసలు కారణం ఆ కథకు స్క్రీన్ ప్లే రచయితగా పనిచేసిన జయమోహన్ బయటపెట్టారు.
చారిత్రాత్మక కథతో తెరకెక్కే ఆ సినిమాను దేవాలయాల్లో తీయాలనుకున్నారట.
అయితే తమిళనాడులో ఉన్న ఏ దేవాలయం కూడా తమకు షూటింగ్ కు అనుమతి ఇవ్వలేదని.అయితే అవి సెట్స్ వేస్తే వాటి బడ్జెట్టే 50 కోట్ల పైన అవుతుందట.
ఇక స్టార్ కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ అంతా చూసుకుంటే సినిమా బడ్జెట్ 200 కోట్లకు చేరుతుందని లెక్కతేలింది.అందుకే ఆ సినిమాను అటకెక్కించారట దర్శక నిర్మాతలు.
మరి సినిమా మీద అంత గురి ఉంటే ఇప్పుడు సౌత్ సినిమా బడ్జెట్ రేంజ్ 200 కోట్లు కూడా పెట్టేస్తున్నారు.కాని ఆ సినిమా కూడా అదే రేంజ్ ఫలితాన్ని అందించాలి.
మరి ఆ బడ్జెట్ తగ్గట్టు నిర్మాతలు వస్తే మళ్లీ ఆ సినిమా పట్టాలెక్కే అవకాశాలునాయని టాక్.