ఎప్పుడో 13-14 నెలల క్రితం మొదలుపెట్టిన సినిమా స్పైడర్.ఇంత సమయం రాజమౌళికి దొరికితే బాహుబలి 3 తీసేస్తారు.
కాని స్పైడర్ పనులు ఇంకా పూర్తి కాలేదు.ఓ పాటతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలి ఉన్నాయి.
సెప్టెంబర్ 27న రావడం ఎలాగో ఖాయం.కాని ఇప్పటివరకు ఈ సినిమా ఊహించిన హైప్ క్రియేట్ చేయలేకపోయింది అనే చెప్పాలి.100 కోట్లకు పైగా బడ్జెట్.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో అయితే దర్శకుడు ఎఆర్ మురుగదాస్ .అయినా జనాలకి కనెక్ట్ కావడం లేదు.ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఎవరిని మెప్పించలేదు.
ఆ ఇంగ్లిష్ పేరు ఏంటో, ఆ స్పైడర్ ఏంటో అంటూ బి,సి సెంటర్ల బయ్యర్ల నుంచి ఇప్పటికే నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది అంట.ఇక మొదటి టీజర్ విపరీతంగా ఆకట్టుకున్నా, రెండోవ టీజర్ తుస్సుమనిపించింది.దాంతో జనరేట్ అయిన హైప్ మళ్ళీ డౌన్ అయ్యింది.
ఇక ఈ సినిమా హిందీలో విడుదల అయ్యేలా లేదు.ఉత్తరాది హక్కులు కొనుక్కున్న AA ఫిలిమ్స్ వారు స్పైడర్ ని ఉత్తర భారతంలో తెలుగుతో పాటు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేసారు.అంటే ఇప్పటికైతే హిందీ వెర్షన్ లేనట్టే.
మరి ఇలాంటి పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దీనికి కారణం స్వయంగా మహేష్ బాబే అంట.
స్పైడర్ ఔట్ పుట్ పట్ల మహేష్ పూర్తిగా సంతృప్తిగా లేడంట.ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్ సరిగా రాలేదు అంట.అందుకే ఈ సినిమాని హిందీలో విడుదల చేసి కామెడి అయ్యే బదులు, అలాంటి తప్పిదాల్ని భరించగలిగే దక్షిణాది ప్రేక్షకులతోనే సరిపెట్టుకుందాం అని అన్నాడట మహేష్.మరి మహేష్ ఇలా అపనమ్మకంగా ఉంటే బయ్యర్ల పరిస్థితి ఏమిటి? అసలే 130 కోట్లకు పైగా పెట్టేసారు సినిమా మీద.