ఏ హీరో ఫ్యాన్స్కు అయిన తమ అభిమాన హీరో సినిమా వస్తుందన్న సమయంకు రాకుంటే చికాకు లేస్తుంది.అదే పదే పదే సినిమాను వాయిదా వేస్తే తమ అభిమాన హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు.
ఇప్పుడు అదే ఆగ్రహంను సూపర్స్టార్ మహేష్బాబు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.‘శ్రీమంతుడు’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రం తర్వాత మహేష్బాబు నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’.
ఈ సినిమా ప్రారంభం కాక ముందు సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం అంటూ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి ప్రకటించాడు.అయితే సంక్రాంతి పోయి నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా సినిమా విడుదల చేయలేక పోయారు.
‘శ్రీమంతుడు’ చిత్రం విడుదలకు ముందే ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించాల్సి ఉంది.కాని మహేష్ బాబు బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమా దాదాపు రెండు నెలలు ఆలస్యం అయ్యింది.
దాంతో సినిమా విడుదల కూడా ఆలస్యం అవ్వనుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.షూటింగ్ ప్రారంభించిన తర్వాత ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు.
అయితే షూటింగ్ ఆలస్యం అవుతూ రావడంతో చిత్రాన్ని మేకు వాయిదా వేశారు.మే 6న విడుదల చేస్తాం అంటూ ఇటీవలే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో పాటు నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి కూడా చెప్పుకొచ్చాడు.
కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మే నెల చివర్లో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.వరుసగా వాయిదా వేస్తూ రావడంతో మహేష్బాబు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రంలో మహేష్బాబుకు జోడీగా సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్స్గా నటిస్తున్న విషయం తెల్సిందే.