సూపర్ స్టార్ మహేష్బాబు అతి త్వరలో ‘శ్రీమంతుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడిన మహేష్బాబు తన బాలీవుడ్ ఎంట్రీ ఆలోచనల గురించి క్లారిటీ ఇచ్చాడు.
గత కొంత కాలంగా మహేష్బాబు బాలీవుడ్కు వెళ్లనున్నాడు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తనకు హిందీలో సినిమా చేయాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.
దేశంలోనే అతి ఎక్కువ సినిమాలు తెరకెక్కే, అతి ఎక్కువ మార్కెట్ విలువ ఉన్న తెలుగులో తాను నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని, తనకు తెలుగు అభిమానులు చాలు అంటూ చెప్పుకొచ్చాడు.
తాను ఎప్పటికి కూడా బాలీవుడ్ వెళ్లను అంటూ క్లారిటీగా చెప్పేశాడు.ఇకపై తన బాలీవుడ్ ఎంట్రీ గురించి మీడియా వారు దయచేసి ఎత్తవద్దంటూ మహేష్ పేర్కొన్నాడు.
‘శ్రీమంతుడు’ సినిమాతో మహేష్బాబు తమిళంలో ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే.‘సెల్వం ధనం’ పేరుతో తమిళనాట ఈ సినిమా విడుదల కాబోతుంది.
ఈనెల 7న ‘శ్రీమంతుడు’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
.