మహేష్ బాబు తన అభిమానులకు మరియు నూతన నటీనటులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు.తాను త్వరలో నటించబోతున్న బ్రహ్మోత్సవం సినిమాలో కొత్త వారికి చాన్స్ కల్పించనున్నట్లుగా తెలుస్తోంది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రసాద్ వి పొట్లూరి నిర్మాణంలో తెరకెక్కబోతున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించేందుకు 15 నుండి 50 సంవత్సరాల నూతన నటీనటులు కావాలెను అంటూ పీవీపీ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఆసక్తిగల వారు సంప్రదించాలంటూ మెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ను కూడా ఇచ్చింది.
మహేష్బాబు సినిమాలో నటించే అవకాశం కోసం స్టార్స్ సైతం పోటీ పడతారు.అలాంటిది కొత్త వారికి అవకాశం అనగానే అప్లికేషన్లు వేల సంఖ్యలో వచ్చి పడుతున్నాయి.
వచ్చిన అప్లికేషన్స్ నుండి దాదాపుగా 30 మందిని ఎంపిక చేసే అవకాశాలున్నాయని చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్బాబు ‘శ్రీమంతుడు’ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా విడుదల తర్వాత ‘బ్రహ్మోత్సవం’ ప్రారంభం కానుంది.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.