ఊపిరి లాంటి సక్సెస్ తరువాత, ఇన్ని నెలలు గడిచాక కూడా వంశీ పైడిపల్లి తదుపరి సినిమా పట్టలు ఎక్కలేదు.అఖిల్ మాటమారిస్తే, మహేష్ బాబు ఏకంగా బక్రా చేశాడు అని గుసగుసలు పెట్టుకుంటున్నారు ఫిలింనగర్ ప్రజానికం.
ఇంతకి మహేష్ బాబు ఎలా బకరా చేసాడు అని అడుగుతున్నారా!
బ్రహ్మోత్సవం సినిమాకి వచ్చిన నష్టాల్ని పూడ్చాలని బయ్యర్లు మహేష్ మీద, నిర్మాత పీవిపి మీద ఒత్తిడి తెచ్చారు.వారిని శాంతింపజేయాలన్నా, నష్టపరిహారం చెల్లించడాన్ని సాగదీయాలన్నా, పీవీపి మరో సినిమా చూపెట్టి, ఇదిగో ఈ సినిమా మీకే, తక్కువ రేటుకి ఇస్తాం అని ఆశచూపాలి.
ఆరకంగా డిస్ట్రిబ్యూటర్లను కొన్నిరోజులపాటు సైలెంట్ గా ఉంచేందుకు వంశీ పైడిపల్లితో మహేష్ బాబు సినిమా అని చెప్పి, ఆ దర్శకుడిని ఓ పావులా వాడుకున్నారని టాక్.
ఇందులో నిజానిజాలు మనకు తెలియవు.
నిజంగానే వంశీని మహేష్ – పివిపి బక్రా చేసి వాడుకున్నారా, లేక నిజంగానే వంశీ కథ అంతగా నచ్చకపోవడంతో మహేష్ సినిమాని వాయిదా లేదా క్యాన్సల్ చేసాడా అనే విషయం మీద ఓ క్లారిటి లేదు.ఏది ఏమైనా, అటు చేసి, ఇటు చేసి, ప్రస్తుతానికి వంశీ చేతిలో సినిమా లేదు.