దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘బాహుబలి’.ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రెండు పార్ట్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ను వేసవి కానుకగా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.ప్రభాస్ ద్విపాత్రాభినయంలో అనుష్క మరియు తమన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో విలన్గా రానా నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం మరియు హిందీల్లో కూడా విడుదల కానుంది.
ఇప్పటికే ‘బాహుబలి’ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
పలు ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఈ సినిమాకు సంబంధించిన చర్చ జరిగింది.అందుకే తెలుగుతో పాటు తమిళం మరియు హిందీల్లో కూడా ‘బాహుబలి’ పేరుతోనే ఈ సినిమాను విడుదల చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నాడు.
మొదట తమిళంలో ఈ సినిమాను ‘మహాబలి’ అనే టైటిల్తో విడుదల చేయాలని అనుకున్నారు.తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఇటీవల ‘ఐ’ సినిమాకు కూడా దర్శకుడు శంకర్ ఇదే పద్దతిని ఫాలో అయ్యాడు.తెలుగులో మొదట ‘మనోహరుడు’గా ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు.
కాని ‘ఐ’కు వచ్చిన పబ్లిసిటీ దృష్ట్యా తెలుగులో కూడా ‘ఐ’గానే విడుదల చేశారు.తాజాగా రాజమౌళి కూడా తెలివిగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు.