జబర్దస్త్.ప్రస్తుతం తెలుగులో దీన్ని మించిన కామెడీ షో లేదు.
ఇంకా చెప్పాలంటే తెలుగు బుల్లితెర మీద ఈ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్న కామెడీ షో మరొకటి లేదు.గురు, శుక్రవారాలు వచ్చాయంటే చాలు ఏపీ, తెలంగాణలో కోట్లాది మంది టీవీలకు అతుక్కుపోయి మరీ ఈ కామెడీ షో ఎంజాయ్ చేస్తారు.
ఈ షో ఎంత పాపులర్ అయ్యిందే …అదే స్థాయిలో అడల్ట్ కంటెంట్తో నిండిపోతుందని విమర్శలు కూడా మూటకట్టుకుంది.
బిజీ షెడ్యూల్ వల్ల టీవీలో ఈ షో మిస్ అయినా తర్వాత యూట్యూబ్లో అయినా ఆ షో చూసేస్తున్నారు.
దీంతో జబర్దస్త్ దెబ్బకు అటు ఈటీవీ టీఆర్పీ రేటింగ్ టాప్ లేవడంతో పాటు యూట్యూబ్లో సైతం ఈ షో వీడియోలకు లక్షలు, కోట్లల్లోనే వ్యూస్ వస్తున్నాయి.జబర్దస్త్ తర్వాత అప్పటి వరకు తెలుగు బుల్లితెర మీద వెనకపడి ఉన్న ఈటీవీ ఒక్కసారిగా స్పీడప్ అయ్యింది.
మిగిలిన ఛానెల్స్కు ఈటీవీ ఈ ఒక్క షోతోనే గట్టి పోటీ ఇచ్చేసింది.ఇదే జబర్దస్త్ షోకు ధీటుగా మిగిలిన ఛానెళ్లలో చాలా కామెడీ షోలు వచ్చినా అవేవి క్లిక్ కాలేదు.
అయితే ఇప్పుడు మాత్రం దీన్ని కొట్టేందుకు మా టీవీ ఓ పెద్ద ప్లాన్తో వస్తోంది.జబర్దస్త్ షోలో చేసిన ధన్రాజ్, వేణు లాంటి కమెడియన్లతో దేశముదుర్లు పేరుతో ఓ కొత్త షో ప్లాన్ చేసింది.
ఈ షోకు మరింత కలరింగ్ ఇచ్చేందుకు పోసాని కృష్ణమురళిని జడ్జ్గా పెట్టుకున్నారు.గతంలో పోసాని పాల్గొన్న టీవీ షోలకు మంచి ఆదరణ దక్కింది.
ఇప్పుడు ఆయన పూర్తిస్థాయిలో ఒక షోకు పని చేయబోతున్నారు.నాగబాబుకు పోసాని ఇక్కడ పోటీ అన్నమాట.
మరి ఈ దేశముదుర్లు జబర్దస్త్కు ఏ రేంజ్ టఫ్ ఫైట్ ఇస్తారో చూడాలి.