అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు.అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ కోర్టులో కళ్యాణ్ అనే నటుడు ఫిర్యాదు చేశాడు.
దాంతో కోర్టు విచారణ జరుపుతోంది.ఎన్నికలు జరిపేందుకు అనుమతిని ఇచ్చిన కోర్టు, ఫలితాలపై స్టే విధించిన విషయం తెల్సిందే.
రెండు మూడు రోజుల్లో ఫలితాలు వస్తాయని ఆశించిన అభ్యర్థులకు తాజాగా మరిన్ని రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
కోర్టు ఈ కేసును ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.
దాంతో అభ్యర్థులు ఏడవ తేదీ వరకు ఎదురు చూడక తప్పదు.హోరీ హోరీ ప్రచారంతో ఈ ఎన్నికలపై అందరి దృష్టి కేంద్రీ కృతం అయ్యి ఉంది.
రాజేంద్ర ప్రసాద్ మరియు జయసుధలు ఈ ఎన్నికల్లో పోటీ పోటీగా ఢీ కొట్టారు.రాజకీయ ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికల ఫలితాలు వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో అభ్యర్థులతో పాటు ప్రేక్షకులు మరియు వారికి మద్దతు ఇచ్చిన వారు సైతం నిరాశలో మునిగి పోయారు.