అలా ఎలా సినిమాతో పరిచయమైన హెబ్బా పటేల్ కుమారి 21ఎఫ్ సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించింది.ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్ ను హెబ్బా కూడా కాపాడుకుంటూ అభిమానులను హాట్ హాట్ అందాలతో అలరిస్తూ వచ్చింది.
అయితే ఇప్పటికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మిస్టర్ సినిమాలో లావణ్య త్రిపాఠితో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న హెబ్భా పటేల్ ఇప్పుడు మరో మెగా హీరో అవకాశాన్ని అందుకుందట.
గోపిచంద్ మలినేని డైరక్షన్లో సాయి ధరం తేజ్ హీరోగా ఓ సినిమా స్టార్ట్ అయింది.
అయితే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తీసుకున్నారు కూడా.ముహుర్తానికి అమ్మడు వచ్చి కొబ్బరికాయ కొట్టింది.
ఇక ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే మహేష్ మురుగదాస్ సినిమాకు ఓకే చెప్పిన రకుల్ తేజు సినిమాను వదులుకుందట.ఇక ఆ సినిమాలో కూడా హెబ్భా పటేల్ అవకాశం దక్కించుకుందని ఎక్స్ క్లూజివ్ టాక్.
సో మెగా హీరోలతో ఓ సినిమాలో నటిస్తేనే మెగా ఫ్యాన్స్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది.మరి ఇద్దరు మెగా హీరోలతో ఒకేసారి రొమాన్స్ చేస్తున్న హెబ్భా లక్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మరి కుమారితో కానిచ్చేస్తున్న తేజు అండ్ కో సినిమాను ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.