ప్రతిపక్ష నేత జగన్ .తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే స్వచ్ఛందంగా జైలుకెళ్లేందుకు తను సిద్దమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు.
ఆదివారం ఆయన మహానాడు వేదికపై నుంచి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న రుణమాఫీ, పట్టిసీమ, అమరావతి నిర్మాణంతో సహా ప్రతి చోటా తనకు ముడుపులు అందుతున్నట్టు వైసిపి నేతలు పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
జగన్మోహన్రెడ్డి ఊసరవెల్లిని మించి పోయి రాజకీయాల రంగులు మారుస్తున్నారని, సొంత పార్టీ నేతలే ఆతని ప్రవర్తనకి విసిగి వేసారిపోయారని వ్యాఖ్యానించారు.
తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేలాది కోట్లను తమ సంస్థలలో పెట్టుబడులుగా కొట్టేసారని… అలాంటి పనులతో తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఉట్టి పరిస్థితిలోనూ చెడ్డపేరు తేనని స్పస్టం చేసారు.
కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వంపై బురద జల్లాలని జగన్ కుట్ర పన్నారన్నారు.
ఆర్ధిక నేరస్తుడిగా జగన్,తో పాటు తునిలోకాపునాడు పేరుతో విధ్వంసానికి పాల్పడ్డ వైసీపీ నేతలు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు
.