సూపర్ స్టార్ మహేష్బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు’.ఈ సినిమా ఫస్ట్లుక్ ట్రైలర్ మే 31న కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అదే రోజున ‘బాహుబలి’ ఫస్ట్లుక్ టీజర్తో పాటు ఆడియో కూడా విడుదల చేయనున్నట్లుగా ప్రకటించడంతో ‘శ్రీమంతుడు’ను పట్టించుకునే వారు ఉండరేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.మహేష్బాబుకు ఉన్న క్రేజ్ కంటే ‘బాహుబలి’ సినిమాపై ఏర్పడ్డ అంచనాలు దాదాపుగా డబుల్ ఉన్నాయి.
దాంతో ‘శ్రీమంతుడు’ టీజర్కు ఎలాంటి స్పందన వస్తుందో అని చిత్ర యూనిట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.అయితే తాజాగా ‘బాహుబలి’ ఆడియోతో పాటు టీజర్ విడుదల కార్యక్రమం వాయిదా వేయడం జరిగింది.
‘బాహుబలి’ వాయిదా పడటంతో ‘శ్రీమంతుడు’ ఫస్ట్లుక్కు లైన్ క్లీయర్ అయినట్లయ్యింది.ఇక మే 31న ‘శ్రీమంతుడు’ మాత్రమే వస్తుండటంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది.
ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.‘మిర్చి’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది.
ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చిన ఈ సినిమాను జులై 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.‘బాహుబలి’ విడుదలైన వారం రోజులకే ఈ సినిమా విడుదల కాబోతుంది.