మానవశరీరంలో 70% నీరే ఉంటుందని సైన్స్ చెబుతోంది.మన రక్తంలో, కండరాల్లో, ఎముకల్లో నీరు ఉంటుంది.
మెటబాలిజం సరైన ట్రాక్ లో ఉండాలంటే నీరు అత్యవసరం.అందుకే తక్కువ తాగినా, పూర్తిగా నీళ్ళు తాగకుండా ఉండలేం.
రోజుకి 7-8 గ్లాసుల నీరైనా తాగాలి.ఇక నీళ్ళు తక్కువగా తాగితే ఎన్ని ప్రమాదాలో మీరే చూడండి.
* అవసరమైన మోతాదులో నీరు శరీరానికి అందకపోతే బాడి డీహైడ్రేట్ అయిపోతుంది.ఏ పని సరిగా చేయలేరు.మెల్లిమెల్లిగా అనేకరకాల అరోగ్య సమస్యలు వస్తాయి.
* నీరు తక్కువగా తాగితే, శరీరంలో వేడి పెరిగిపోతుంది.
* నీళ్ళు తక్కువగా తాగితే, సాల్ట్ లెవెల్స్ విపరీతంగా పడిపోయి, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.దాంతో డయబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.అలాగే హార్ట్ రేట్ బ్యాలెన్స్ తప్పుతుంది.
* రక్తానికి నీళ్ళు అవసరం.
సరిపడ నీళ్ళు శరీరంలోకి చేరకపోతే బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది.
* జీర్ణక్రియకు సహాయపడతుంది నీరు.
నీటి శాతం తగ్గినాకొద్ది జీర్ణక్రియ దెబ్బతింటూ ఉంటుంది.
* నీరు తాగే అలవాటు తగ్గిస్తే అది కడుపులో ఎసిడిటికి, ఆల్సర్ కి కారణమవుతుంది.
* చర్మ సౌందర్యానికి కూడా నీరు ఎంతో అవసరం.నీరు తక్కువగా తాగేవారు ఉన్న వయసుకన్నా పెద్దగా కనిపిస్తారు.
* శరీరంలోని మలినాలు మూత్రం రూపంలో బయటకి రావాలంటే నీరు అతిముఖ్యం.కాబట్టి నీళ్ళు ఎక్కువగా తాగాలి.