సంచలనాల ‘బాహుబలి’కి రెండవ పార్ట్ వచ్చే నెల నుండి షూటింగ్ ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే.మొదటి పార్ట్ భారీ విజయంతో రెండవ పార్ట్కు సంబంధించిన చిన్న విషయం కూడా ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని కలుగ జేస్తోంది.
రెండవ పార్ట్లో పలువురు స్టార్స్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారు అంటూ ఇప్పటికే పలు సార్లు వార్తలు వచ్చాయి.తాజాగా మరో ఆసక్తికర వార్త ఒకటి ఫిల్మ్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది.
‘బాహుబలి’ సోదరుడు అయిన భల్లాలదేవుడి భార్యగా లావణ్య త్రిపాఠి నటించబోతుంది.ముందుగా ఈ పాత్రకు శ్రియను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
కాని చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా లావణ్య త్రిపాఠితో చర్చు జరిపినట్లుగా చెబుతున్నారు.లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో దాదాపు 15 నిమిషాలు కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
దేవసేన దక్కక పోవడంతో ఇష్టం లేక పోయినా కూడా మరో యువతిని భల్లాలదేవుడు పెళ్లి చేసుకుంటాడు.కొన్ని కారణాల వల్ల ఆమె కొడుకుకు జన్మనిచ్చి చని పోతుంది.
ఆ పాత్రలో ఇప్పుడు లావణ్య త్రిపాఠి నటించనున్నట్లుగా చెబుతున్నారు.పూర్తి వివరాలు త్వరలో తేలాల్సి ఉంది.
వచ్చే సంవత్సరం చివర్లో ‘బాహుబలి’ రెండవ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.