దివగంత తమిళనాడు ముఖ్యమంత్రి, అలానటి సినీనటి జయలలిత ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయా? కొడనాడులో ఉన్న అమె ఎస్టేట్ లో దుష్టశక్తిలకి ఇల్లుగా మారిందా? లేక జయలలిత ఆత్మ అక్కడే తిరుగుతూ తను బ్రతికున్నప్పుడు కుట్రలు పన్నినవారి మీద పగ తీర్చుకుంటోందా? వినడానికి సిల్లిగా ఉంది కదూ.మరి తమిళ జనాలు ప్రస్తుతం ఈ టాపిక్ మీదే మాట్లాడుకుంటున్నారు.
దానికి కారణం వరుసగా జరుగుతున్న మరణాలు.
మొదట ఆ ఎస్టేట్ కాపాలాదారుడు ఓంకార్ మృత్యువాత పడ్డాడు.
ఇప్పుడేమో జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజ్ ఆక్సిడెంటులో ప్రాణాలు కోల్పోయాడు.ఈ సంఘటన శుక్రవారం రాత్రి సాలేం జిల్లా అత్తూర్ దగ్గర జరిగింది.
విషయం ఏమిటంటే, ఓంకార్ హత్య కేసులో కనకరాజ్ అనుమానితుడు.ఇలా ఒకరి హత్య జరిగి, ఆ తరువాత అనుమానితుడు చనిపోవడం ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది.
బైక్ మీద వెళుతున్న కనకరాజ్ ని కారు ఢీకొట్టింది.ఇది మాములు ఆక్సిడెంట్ అయితే కాదు ఎవరో ప్లాన్ చేసారు, లేదంటే ఏదైనా శక్తి దీని వెనుక దాగి ఉందని అని జయలలిత వీరాభిమానుల మాట.వారి వెర్షన్ ఏమిటంటే .ఈ కనకరాజ్ జయలలిత దగ్గర డ్రైవర్ గా పనిచేసేవాడు.కాని జయలలితకి చెడ్డపేరు వచ్చేలా బయట ఇతని ప్రవర్తన ఉండేది.దాంతో ఉద్యోగం ఊడింది.ఏదో బేకరిలో పనిచేస్తూ, అమ్మ చనిపోయిన తరువాత ఎస్టేట్ లో చొరబడి దోపిడికి ప్లాన్ చేసాడని, అలాంటి పనికి ప్రయత్నించేటప్పుడే వాచ్ మెన్ ఓంకార్ ని చంపేసాడని, అందుకే అమ్మ అత్మ కనకరాజ్ ప్రాణాల్ని యాక్సిడెంటు రూపంలో లాగేసుకుందని చెప్పుకుంటున్నారు అమ్మ అభిమానులు.ఎంతైనా అభిమానులు కదా, ఇలాంటి క్రేజీ ఆలోచనలు వారికే వస్తాయి.