పూరి జగన్నాథ్ అంటే ఒక బ్రాండ్.ఈ తరం దర్శకుల్లో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మొదటి వ్యక్తీ.
పోకిరి అనే సినిమాతో తెలుగు సినిమా దశాదిశలు మార్చిన డైరెక్టర్.పవన్ కళ్యాణ్ కి బద్రి కాని, మహేష్ బాబుకి పోకిరి కాని, మాస్ జనాల్లో వీరికి క్రేజ్ రావడానికి పూరియే కారణం.
పూరి హీరోలు తిక్కగా ఉంటారు, నలుగురిలో ఒకరిగా ఉండరు.రఫ్ అండ్ టఫ్ ఆటిట్యూడ్ వాళ్ళది.
మ్యానరిజం వల్లే పూరి సినిమాలు అంట పెద్ద హిట్లుగా నిలిచేవి.కాని ఇప్పుడు అవే పూరి సినిమాలకు శాపంగా మారాయి.
ఉదాహరణకు బిజినెస్ మెన్.మహేష్ కి ఫ్యామిలి ఆడియెన్స్ చాలా ఎక్కువ, దూకుడు అన్ని రికార్డులు బద్దలుకోట్టిందంటే దానికి ఫ్యామిలి ఆడియెన్స్ బాగా ఉపయోగపడ్డారు.
కాని బిజినెస్ మెన్ యూత్ తప్ప ఇంకెవరు పట్టించుకోలేదు.దానికి కారణం మహేష్ క్యారెక్టర్ మరీ ఊరమాస్ గా ఉండటమే.
మహేష్ తో ఏకంగా బూతులు చెప్పించాడు పూరి.అక్కడినుంచి మొదలు పూరి సినిమా అంటే, ఫ్యామిలి ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు.
ఓవర్సీస్ లో పూరి డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది.
అటు ఓవర్సీస్ మార్కెట్ లేక, ఇటు ఫ్యామిలి సపోర్ట్ లేక, ఇంకెక్కడి నుంచి వస్తాయి కలెక్షన్లు ? కేవలం యూత్ వల్లే సినిమాని హిట్ చేయొచ్చు ఏమో కాని బ్లాక్బస్టర్ చేయలేం.ఇప్పుడు లోఫర్ ది అదే పరిస్థితి.అమ్మ సెంటిమెంట్ సినిమా అని ప్రచారం జరుగుతున్నా, పూరి మార్క్ తిక్క వేషాలు, ద్వంధర్థాల వల్ల సినిమాని క్లాస్ ఆడియెన్స్, ఫ్యామిలి ఆడియెన్స్ పట్టించుకోవట్లేదు.
అందుకే డీసేంట్ టాక్ తో కుడా కలెక్షన్లు రావట్లేదు.ఒక్క లోఫర్ మాత్రమె కాదు, కేమెరమెన్ గంగతో రాంబాబు నుంచి గత జ్యోతి లక్ష్మి దాక ఇదే పరిస్థితి.