ఏపీలో బలపడేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదని బీజేపీ నేతలు భావిస్తున్నారు.ఏపీలో వైసీపీ, టీడీపీల్లో ఉన్న సినీగ్లామర్ను ఉపయోగించుకోవాలని అధిష్టానం నిర్ణయించింది.
తమకూ సినీ గ్లామర్ ఉంటే.ప్లస్ అవుతుందనే నిర్ణయానికి బీజేపీ నేతలు వచ్చారట.
ఇందులో భాగంగానే `బాహుబలి`ని కూడా తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారట.ముఖ్యంగా ఏపీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ను వీలైనంతంగా క్యాష్ చేసుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు.
ఇందులో భాగంగానే ప్రభాస్ పెదనాన్న, బీజేపీ నేత కృష్ణం రాజుకు గవర్నర్ గిరీకి ఎంపిక చేయాలని చూస్తున్నారట.
రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తారనే ప్రచారం జోరందుకుంది.
ఇందులో భాగంగానే ఎప్పటినుంచో గవర్నర్ గిరీ కోసం ఎదురుచూస్తున్న టీడీపీ నేత మోత్కుపల్లి.త్వరలోనే తీపికబురు వింటారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పార్టీ శ్రేణులతో చెప్పారు.
అయితే ఇప్పుడు ఈ గవర్నర్ గిరీలోనే సినీనటుడు కృష్ణంరాజు పేరు కూడా వినిపిస్తోంది.కృష్ణంరాజు దంపతులు ప్రధాని మోడీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కృష్ణంరాజు గతంలో బీజేపీ ఎంపీగా గెలిచారు.అయితే ఆ తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు.
అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో ఆయన తిరిగి కమలం గూటికి చేరుకున్నారు
పెద్దగా పార్టీలో యాక్టివ్ గా లేకపోయినప్పటికీ కృష్ణంరాజు అనేకసార్లు బీజేపీ నేతలతో కలిసి రావడం చర్చకు దారి తీస్తోంది.కొద్దిరోజుల్లోనే అనేక రాష్ట్రాల్లో గవర్నర్ల నియామంకం జరగనుంది.
ఈమేరకు ప్రధానమంత్రి కార్యాలయం కసరత్తులు ప్రారంభించింది.అయితే ఇప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న కృష్ణంరాజు గవర్నర్ గిరీపై కన్నేసినట్లు సమాచారం.
ఏపీలో బీజేపీ నేతలను గవర్నర్లుగా నియమిస్తారన్న వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే కృష్ణంరాజు దంపతులు ప్రధాని మోడీని కలిశారు.
అయితే ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమేనని చెబుతున్నప్పటికీ కృష్ణంరాజు మాత్రం గవర్నర్ పదవి కోసమనేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి
కృష్ణంరాజు సోదరుడి కుమారుడు ప్రభాస్.టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు.
`బాహుబలి` సినిమాలతో ఆయన జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు.యూపీ ఎన్నికల ప్రచార సమయంలో కూడా ప్రధాని మోడీ బాహుబలి సినిమా గురించి ప్రస్తావించారు.
ప్రభాస్ ను తీసుకుని గతంలో కృష్ణంరాజు దంపతులు ప్రధానిని కలిశారు.ఏపీలో కృష్ణంరాజుకు గవర్నర్ పదవి ఇస్తే ప్రభాస్ అభిమానులు కూడా బీజేపీ పక్షాన చేరతారని ఆ పార్టీ భావిస్తోంది.
మరి కృష్ణంరాజుకు గవర్నర్ పదవి దక్కుతుందా? ఏమో చూడాలి మరి.బీజేపీలో ఏదైనా జరగొచ్చంటున్నారు విశ్లేషకులు.