పసుపు పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోకి మరో నాయకుడు రంగప్రవేశం చేయబోతున్నాడు.నెల్లూరు సోదరులు ఆనం రామనారాయణ రెడ్డి , ఆనం వివేకానంద రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు.
దీంతో చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఉత్తరాంధ్ర నాయకుడు , మాజీ మంత్రి , మాజీ వైకాపా నాయకుడైన కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరడానికి సర్వం సిద్ధం అయింది.చాలా కాలం క్రితమే కొణతా లకు జగన్తో విభేదాలు వచ్చాయి.
దీనితో పార్టీ నుంచి బాటకు వచ్చారు.దీర్ఘ కాలం నుంచి ఖాళీగానే ఉన్నారు.
వైకాపా నుంచి బయటకు రాగానే ఆయన చూపు టీడీపీ మీదనే పడింది.బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగినా అది నిజం కాలేదు.
అందరి మాదిరిగానే అధికార పార్టీలో చేరాలని అనుకున్నారు.ఇప్పుడు లైన్ క్లియర్ అయినట్లుగా ఉంది.
విశాఖ జిల్లాకే చెందిన మంత్రి అయ్యన్న పాత్రుడు కొణతాలను టీడీపీలో చేరుస్తున్నారని సమాచారం.తెలంగాణాలో గులాబీ పార్టీలోకి, ఆంధ్రాలో టీడీపీ లోకి నాయకులు వలస పోతున్నారు.
వలసలు పెరిగిన కొద్దీ గ్రూపు రాజకీయాలు కూడా అధికం అవుతాయి.