టాలీవుడ్ స్టార్ రైటర్ల జాబితాలో కోన వెంకట్ ముందు వరుసలో ఉంటాడు.స్టార్ హీరోలు ఈయనతో దగ్గరుండి మరీ తమ సినిమాలకు కథలు రాయించుకుంటారు.
ఒక్కో కథకు దాదాపుగా కోటికి పైగా వసూళ్లు చేసే ఈయన రాసే కథలు మాత్రం రొటీన్గా ఉంటాయి.గత కొంత కాలంగా ఒకే తరహా కథను పాత్రలు మార్చుతూ, డైలాగ్స్ మార్చుతూ, స్క్రీన్ప్లే మార్చుతూ చూపిస్తున్నాడు.
ఇటీవల ఈయన రచన సారధ్యంలో వచ్చిన ‘పండగ చేస్కో’ సినిమా సైతం పలు గత సినిమాలను తలపిస్తోంది.ఆ సినిమాలో ఏకంగా రొటీన్ సినిమాలే తీస్తాం.
ప్రేక్షకులు చూస్తున్నప్పుడు, రివ్యూలు రాసే వారికి ఏంటి నొప్పి అంటూ ఒక డైలాగ్ కూడా చెప్పించాడు.అయినా కూడా కోన కలంపై విమర్శలు వచ్చాయి.
గత కొంత కాలంగా రాస్తున్న మూస కథలకు బ్రేక్ చెప్తానంటూ కోన వెంకట్ ప్రకటించాడు.ప్రేక్షకులు చూస్తున్నారని ఇంతకాలం అవే అవే కథలు రిపీట్ చేయడం జరిగింది, కాని ఇకపై దర్శకులు, నిర్మాతలు అడిగినా కూడా అలాంటి కథలు రాయను అంటూ తేల్చి చెప్పాడు.
ఇకపై తన కలం నుండి కొత్తదనంను ప్రేక్షకులకు చూస్తారంటూ సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడు.కోన కొత్త కథలు రాస్తే అవి ప్రేక్షకులు ఆధరిస్తారా అనేది ప్రస్తుతం అనుమానంగా ఉంది.
అయినా కోన కొత్త కథలు రాస్తే వాటిని నిర్మాతలు తీసుకుంటారా, హీరోలు ఆ కథలో నటించేందుకు ఆసక్తి చూపుతారా అనేది కూడా అనుమానమే.చూద్దాం కోన రాసే కొత్త కథలు ఎలా ఉంటాయో.