మెగా ఫ్యాన్స్ చాలా చాలా సంతోషించే వార్త ఒకటి గత రెండు మూడు రోజులుగా మీడియాలో వస్తున్న విషయం తెల్సిందే.మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో చిరంజీవి హీరోగా కనిపించనున్నాడు అని, చిరంజీవి సినిమాకు చరణ్ ఫైట్స్ కంపోజ్ చేసే పాత్రలో కనిపించనున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
దాంతో మెగా ఫ్యాన్స్ మరోసారి వెండి తెరపై ఇద్దరు మెగాస్టార్స్ను చూడవచ్చని అనుకున్నారు.‘మగధీర’ తర్వాత మరోసారి చరణ్, చిరులు ఆన్ స్క్రీన్పై సందడి చేయనున్నారు అంటూ మెగా ఫ్యాన్స్ గాల్లో తేలిపోయారు.
మెగా ఫ్యాన్స్ గాల్లో తేలుతుంటే వారి గాలి తీసేశాడు రచయిత కోన వెంకట్.చరణ్ నటిస్తున్న తాజా చిత్రానికి ఒక రచయితగా వ్యవహరిస్తున్న కోన వెంకట్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
చరణ్ సినిమాలో చిరంజీవి నటిస్తున్నాడు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్ని ఒట్టి పుకార్లే అని, మెగా ఫ్యాన్స్ వాటిని నమ్మవద్దంటూ క్లారిటీ ఇచ్చాడు.కోన వ్యాఖ్యతో మెగా ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు.
చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇదే సినిమాలో నాగార్జున హీరోగా కనిపించనున్నాడని కూడా వార్తలు వచ్చాయి.
మరి ఆ వార్తలు ఎంత వరకు నిజమో చూడాలి.