తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తం కుమార్ రెడ్డి ఎంపికను కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు.పొన్నాలను తప్పించడం మంచిదే అయినా, ఉత్తంను కొత్త అధ్యక్షుడిగా నియమించడం మంచి పద్దతి కాదని, పార్టీలో సీనియర్ నేతలను సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అసమ్మతి గళం వినిపిస్తున్న వారిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్యుడిగా ఉన్నాడు.ఈయనకు మొదటి నుండి కూడా ఉత్తం కుమార్ రెడ్డితో పొసగదనే విషయం అందరికి తెలిసింది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డిలు ఇద్దరు కూడా నల్లగొండ జిల్లాకు చెందిన వారే.జిల్లాలో వీరిద్దరు తమ ప్రభావం కోసం కోసం పోటీ పడుతూ ఉండే వారు.
ఇప్పుడు ఉత్తంకు పీసీసీ చీప్ పదవికి ఇవ్వడంతో కోమటి రెడ్డి ఫైర్ అవుతున్నాడు.తనతో వచ్చే నాయకులతో ఈయన త్వరలో భేటీ అయ్యి, హైకమాండ్కు ఉత్తంను పీసీసీ చీప్ పదవి ఇవ్వద్దని లేఖ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఉత్తంకు పీసీసీ చీప్ ఇస్తే తాము సహకరించేది లేదని ముందే కోమటి రెడ్డి ప్రకటించాడు.