సినిమా ఎంత బడ్జెట్ తో తీసినా ఎంత ప్రమోట్ చేసినా మొదటి ఆట వచ్చే టాక్ బట్టే వసూళ్లు ఉంటాయి.ఈ క్రమంలో రివ్యూయర్లు ఇచ్చే రెటింగ్స్ కు కూడా సినిమా మీద ఓ అభిప్రాయానికి వస్తారు ఆడియెన్స్.
అది ఎంత శాతం అన్నది తెలియదు కాని సినిమా చూసేప్పుడు రివ్యూ రెటింగ్ చూసి వెళ్లడం నెటిజెన్లకు అలవాటే.అయితే కొన్ని సార్లు దర్శక నిర్మాతలు రివ్యూయర్ల మీద మండి పడటం మాములే.
సినిమా రివ్యూ పాజిటివ్ గా రాస్తే ఓ రేంజ్లో పొగిడే వారు అదే రివ్యూ నెగటివ్ గా రాస్తే మాత్రం విమర్శలు కురిపిస్తారు.అయితే ఈ క్రమంలో కోలీవుడ్ నటుడు ప్రభు మీడియాతో ముచ్చటించారు.
తను, తన సోదరుడి తనయుడు దుశ్యంత్ రాం కుమార్ కలిసి నిర్మిస్తున్న మీన్ కొళంబుం మణ్ పానైయం సినిమా విషయం గురించి మీడియాతో మాట్లాడిన ప్రభు.సినిమా పరిశ్రమ ఎదుర్కుంటున్న సమస్యలు మీడియా వారికి తెలుసని సినిమాను మనమందరం కాపాడాల్సిన భాధ్యత ఉన్నదని అన్నారు.
ఇక మీడియా సినిమాపై విరుచుకు పడటం మాములే విమర్శలు చేయండి కాని రివ్యూ రాసేప్పుడు చెత్త సినిమా లాంటి మాటలు వాడకండి అని విన్నవించుకున్నారు.మీడియాపై తనకున్న అనుబంధంతోనే తాను ఈ సూచన చేస్తున్నానే తప్ప వేరే ఆలోచనతో కాదు అని అన్నారు.