జగన్ కేసులో ఆ వ్యక్తి అప్రూవల్ గా మారాడా!!

జగన్ పై ఆక్రమాస్తుల కేసు ఉచ్చు రోజు రోజుకు బలంగా బిగుసుకుంటుంది.ఇప్పటికే సీ.

 Kolkata Consultant Key Information On Jagan Case-TeluguStop.com

బీ.ఐ దర్యాప్తు సంస్థ జగన్ ఆక్రమాస్తుల కేసులో ఎన్నో రోజులు దర్యాప్తు జరిపి తమకు లభించిన ఆధారాలతో ఈ కేసును ఈడీకు అప్పగించి చేతులు దులిపేసుకుంది.అయితే మళ్లీ ఏమయిందో తెలీదు కానీ మరో సారి సీబీఐ.ఈ కేసులను తిరగతోడాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే 10పైగా ఛార్జ్ షీట్స్ లో ఏ.1 ముద్దాయిగా ఉన్న జగన్ కు సంబంధించిన జగతి పబ్లికేషన్స్ సంస్థలో సూట్ కేస్ కంపెనీల వివరాలు, అంతేకాకుండా ముంబై, బెంగళూరు,కోల్‌కతా కు చెందిన కంపెనీలు జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టడం ఆ పెట్టుబడుల విలువ దాదాపుగా 200కోట్లకు పైగా ఉండడం.ఇలా అనేక కోణాల్లో సీబీఐ మరో సారి జగన్ ను ప్రశ్నించేందుకు రెడీ అవుతుంది.అంతేకాకుండా కోల్‌కతా కు చెందిన ఒక టాక్స్ కన్సల్టెంట్ ఈ కంపెనీలకు చెందిన వివరాలు చెప్పి వాంగ్మూలం ఇవ్వడంతో మరోసారి జగన్ కు తిప్పలు తప్పవనే చెప్పాలి.

ఇక ఆ కంపెనీలు అన్నింటిలో ఎక్కువశాతం తనే క్రియేట్ చేసినట్లు సైతం ఆ కన్సల్టెంట్ చెప్పినట్లు సమాచారం.మరి ఇవన్నీ రుజువు అయితే మాత్రం జగన్ మరో సారి కట కటాల వెనక్కి వెళ్ళక తప్పదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube