రాజ్యసభ ఎన్నికల బరిలో తమ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గెలుపు తథ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని) ధీమా వ్యక్తం చేశారు.కొద్దిసేపటి క్రితం హైదరాబాదు లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో భేటీ అయిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… రాజ్యసభలో బరిలో నిలిచే అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ప్రకటించారు.
ఈ సందర్భంగా భేటీ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.సాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని తామే ప్రతిపాదించామని చెప్పిన నాని… సాయిరెడ్డి తప్పనిసరిగా విజయం సాధిస్తారని తోడ గొట్టి చెబుతున్నాం అని చెప్పారు.
సాయిరెడ్డిని గెలిపించుకునే బలం తమ పార్టీకి ఉందని ఆయన చెప్పారు.
అధికార టీడీపీ ఎన్ని గిమ్మిక్కులు చేసినా… సాయిరెడ్డి విజయాన్ని మాత్రం ఆపలేదని ఆయన వ్యాఖ్యానించారు.
తమ పార్టీ అధినేత జగన్ కు ప్రతిపక్ష నేత హోదా పోతుందని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కూడా నాని ఆరోపించారు.