ప్రస్తుతం దేశం మొత్తం ఢిల్లీ వైపు ఆసక్తిగా చూస్తోంది.త్వరలో ఢిల్లీలో జరుగబోతున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయంపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఢిల్లీలో ప్రధానంగా పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ మరియు బీజేపీల మధ్యే ఉంది.ఈ రెండు పార్టీల ముఖ్యమంత్రుల అభ్యర్థులు అరవింద్ కేజ్రీవాల్ మరియు కిరణ్ బేడీలు ఇప్పటికే హోరా హోరీగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనే విషయం విశ్లేషకులు కూడా చెప్పలేక పోతున్నారు.అయితే జ్యోతిష్య పండితులు మాత్రం ఈ ఎన్నికల్లో కిరణ్ బేడీ గెలవడం ఖాయం అంటున్నారు.
ప్రస్తుతం కిరణ్ బేడీ గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయని, విజయం వైపుకు ఆ గ్రహాలు కిరణ్ బేడీని తీసుకు వెళ్లడం ఖాయం అంటూ జోతిష్యులు జోష్యం చెబుతున్నారు.ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించింది.
ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ జాతకం కంటే ప్రస్తుతం కిరణ్ బేడీ జాతకం భేషుగ్గా ఉందని, అందుకే విజయలక్ష్మీ కిరణ్ బేడీని వరించడం ఖాయం అంటూ చెబుతున్నారు.దాంతో బీజేపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
మరి ఎన్నికల్లో జ్యోతిష్యం ఫలించి కిరణ్ బేడీ ముఖ్యమంత్రి అవుతారో చూడాలి.