ఇప్పుడు సినిమాలు ఎంత మంచి టాక్ తో ఉన్నా మహా అయితే మూడువారాలు బాగా ఆడుతున్నాయి.ఆ తరువాత ఎన్ని థియేటర్లలో ఉన్న వచ్చేది చిల్లరే.
అందుకే సినిమాకి ఓపెనింగ్స్ రాబట్టడం కోసం, మొదటిరోజు నుంచి థియేటర్ల దగ్గర తమ సినిమాకి సందడి ఉండడం కోసం ప్రమోషన్స్ విపరీతంగా చేస్తున్నారు సినీజనాలు.ప్రమోషన్స్ విపరీతంగా చేస్తే చేసారు కాని, ఒక్కోసారి విపరీతమైన ఆలోచనలతో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.
అక్కడే తిట్లు తింటున్నారు.
ఆమధ్య బాలివుడ్ నటి కంగనా రనౌత్ కట్టి బట్టి అనే సినిమాలో నటించింది.
ఈ సినిమా లిప్ కిస్సుల మీద ఏకంగా ఓ పాట ఉండటంతో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ పెద్ద కాలేజిలో అమ్మాయిలకి అబ్బాయిలకి ముద్దుల పోటి పెట్టాలి అనుకున్నారు.కాని ఏం జరిగింది ? ఈ వింత ఆలోచనలకి పోలీసు పర్మిషన్ దొరక్కపోవడం అటు ఉంచితే, మహిలసంఘాలు కంగనాపై శివాలేత్తాయి.
ఇప్పుడు తాజాగా సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురు, తమిళ నటి వరలక్ష్మి కూడా ఓ పబ్లిసిటి స్టంట్ చేసి అందరిచేత తిట్లు తింటోంది.అసలేం జరిగింది అంటే, వరలక్ష్మి కిడ్నాప్ కి గురైంది అంటూ ఇదిగో ఈ ఫోటోని పోస్ట్ చేసాడు వరలక్ష్మి పీఆర్.
దాంతో అందరు కంగారుపడ్డారు.పోలీసుల దాకా వెళ్ళింది విషయం.
దాంతో వెంటనే .అంతా ఉత్తుత్తడే … కిడ్నాప్ లేదు ఏం లేదు, కొత్త సినిమా ప్రమోషన్ అంటూ కవర్ చేసారు.తెగ నటించేసిన వరలక్ష్మి కూడా నాకు ఇలా ప్రమోషన్ చేస్తున్న విషయం తెలియదు .నాకు సర్ ప్రైజ్ ఇద్దామనుకున్నారు, కంగారుపడ్డ వారందరికీ నా క్షమాపణలు అంటూ చెప్పుకొచ్చింది.సరే, ఆమెకి ఈ వింత పబ్లిసిటి ప్లాన్ తెలియదు అనే ఓ నిమిషంపాటు అనుకుందాం … మరి ఆమెకి తెలియకుండానే ఆమె కిడ్నాప్ కి గురి అయ్యినట్టు ఇలా ఫోటోకి ఫోజు ఇచ్చిందా ?
.