ఉత్తరాంధ్రని మెగా ఫ్యామిలి అడ్డా అని అంటారు.చిరంజీవి నుంచి అల్లు అర్జున్ వరకు, మెగా హీరో అయితే చాలు, సినిమాలు విపరీతంగా ఆడేస్తాయి అక్కడ.
మెగా ఫ్యామిలి హీరోలమీద మరీ అంత మమకారం ఎందుకు పెంచుకున్నారో అక్కడి ప్రజలు తెలియదు కాని,మహేష్ , ఎన్టీఆర్ అక్కడ మెగా ఫ్యామిలిని దాటి సమానమైన పట్టు సాధించలేకపోతున్నారు.అసలు బాహుబలి కూడా నిలబడలేకపోయింది అంటే నమ్మండి.
ఉత్తరాంధ్రలో బాహుబలి టోటల్ గా 9.70 కోట్ల షేర్ వసూలు చేసింది.తృటిలో ఆ గడ్డపై మొదటి 10 కోట్ల షేర్ చిత్రం అయ్యే అవకాశం కోల్పోయింది.కాని ఆ ఛాన్స్ మెగాస్టార్ మిస్ చేసుకోలేదు.ఉత్తరాంధ్రలో బాహుబలి టోటల్ కలెక్షన్ ని రెండొవవారంలోనే దాటేసాడు మెగాస్టార్.ఖైదీ నం 150 బాహుబలి ఉత్తరాంధ్ర టోటల్ షేర్ ని బద్దలు కొట్టేసింది.
మరి ఈ సంచలన రికార్డుని మళ్ళీ దాటేది ఎవరో ! బాహుబలి రెండోవ భాగం దాటేస్తుందా ? కాటమరాయుడు, మహేష్ 23, జై లవ కుశ చిత్రాలకు ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా లేక మళ్ళీ తన రికార్డుని తానే బద్దలు కొట్టేందుకు మెగాస్టార్ దిగి రావాల్సిందేనా ?
.