తమిళంలో హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకున్న కీర్తి సురేష్ తాజాగా రామ్తో కలిసి ‘నేను శైలజ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కొత్త సంవత్సరం కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ను రాబడుతున్న ఈ చిత్రం హీరోయిన్గా కీర్తి సురేష్కు మంచి గుర్తింపును తీసుకు వచ్చింది.తన నటనతో పాటు అందంతో కూడా ఆకట్టుకున్న కీర్తికి తెలుగులో వరుసగా ఆఫర్లు రావడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు.
‘నేను శైలజ’ చిత్రం విడుదల అయ్యి కనీసం ఒక్క రోజు అయిన కాకుండానే ఈమెతో ఇద్దరు నిర్మాతలు సైతం సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది.అయితే ప్రస్తుతం ఈమె తమిళ సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఇప్పట్లో తెలుగులో సినిమాలకు ఓకే చెప్పే అవకాశాలు లేవు.
అయితే భవిష్యత్తులో ఈమె మాత్రం తెలుగులో స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు, అదృష్టం కలిగి ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది.కీర్తి తన తర్వాత తెలుగు సినిమాను స్టార్ హీరోతోనే చేసే అవకాశాలున్నాయి.
ఆ సినిమా కూడా సక్సెస్ అయితే ఇక కీర్తి సురేష్కు తెలుగులో కొంత కాలం వరకు తిరుగు ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు.